- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా పేసర్ మహ్మద్ షమీ అడిలైడ్లో జరిగిన డే/నైట్ టెస్టులో గాయపడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత తీసిన స్కానింగ్లో షమీ మణికట్టు దగ్గర విరిగినట్లు తేలింది. దీంతో వైద్యులు అతడిని 6 వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఇప్పటికే గాయం కారణంగా మిగిలిన మ్యాచ్లకు దూరమైన షమి ఇండియాకు తిరిగి బయలుదేరాడు. అతడి మణికట్టు దగ్గర గాయంతో కనిపించాడు. షమీ కొన్ని వారాలు విశ్రాంతి తీసుకుంటాడని.. గాయం కాస్త తగ్గిన తర్వాత బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీకి వెళ్తాడని బీసీసీఐ తెలిపింది. షమీ తిరగి ఫిట్నెస్ సాధించిన తర్వాతే టీమ్ ఇండియాలోకి తిరిగి వస్తాడని బీసీసీఐ అధికారులు చెబుతున్నారు. దీంతో వచ్చే ఏడాది ఫిబ్రవరి 5 నుంచి ప్రారంభం కానున్న ఇంగ్లాండ్ సిరీస్లో అతడు ఆడేది అనుమానంగా మారింది. అతడు పూర్తి ఫిట్నెస్ సాధిస్తే మిగిలిన మ్యాచ్లకు అందుబాటులో ఉండే అవకాశం ఉన్నది.