ఇక బ్రేకుల్లేవ్.. దూసుకుపోవడమేనంటున్న షారుఖ్

by  |
sharukh-khan
X

దిశ, వెబ్‌డెస్క్: ‘బాలీవుడ్‌ కా బాద్‌ షా’ షారుఖ్ ఖాన్‌ను బిగ్ స్క్రీన్‌పై చూసి దాదాపు 3 ఏళ్లు అవుతోంది. 2018లో వచ్చిన జీరో సినిమా తర్వాత షారుఖ్ దాదాపు ఏడాది గ్యాప్ తీసుకున్నాడు. అయితే గతేడాది సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ‘పథాన్’ సినిమా ఓకే చేశాడు. ఈ సినిమా చిత్రీకరణ జరుగుతుండగానే అట్లీ దర్శకత్వంలో మరో సినిమాను ఓకే చేశాడు. ఈ సినిమాకు ఇంకా పేరు పెట్టలేదు. అయితే షారుఖ్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్‌ కేసులో జైల్లో పడటంతో షారుఖ్ సినిమాలకు బ్రేకులు పడ్డాయి. ఆ తర్వాత ఆర్యన్ అక్టోబర్ నెలలో బయటకు వచ్చాడు.

ఇటీవల కేసుకు సంబంధించిన అన్ని లీగల్ పనులు పూర్తయ్యాయి. దీంతో ఫ్రీ అయిన షారుఖ్ మళ్లీ తన సినిమాలపై దృష్టి పెట్టాడు. ఈ క్రమంలోనే మళ్లీ జిమ్‌కు వెళ్లి బాడీ పెంచుతున్నాడు. అంతా సెట్ అయ్యాక ముందుగా సిద్ధార్థ్ ఆనంద్ ‘పథాన్’ సినిమాను పూర్తి చేయనున్నాడు. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం చివరి దశలో ఉంది. అందుకే ఈ సినిమాను పూర్తి చేసుకున్న తర్వాత అట్లీ సినిమాను కంప్లీట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. దీంతో షారుక్‌కు ఇక బ్రేకుల్లేవ్ అంటూ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.



Next Story