మాధవన్‌ను ప్రశ్నించనున్న షారుఖ్

by  |
మాధవన్‌ను ప్రశ్నించనున్న షారుఖ్
X

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్.. 2018లో వచ్చిన ‘జీరో’ సినిమా తర్వాత మరో సినిమా చేయలేదు. అయితే షారుఖ్ రాబోయే రెండు సినిమాల్లో గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వబోతున్నట్లు సమాచారం. అందులో ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్‌’ అనే చిత్రం ఒకటి కాగా.. పద్మభూషణ్ అవార్డు గ్రహీత , ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్‌ జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. ఇందులో నంబి నారాయణన్‌ పాత్రలో మాధవన్ నటించారు. అంతేకాదు ఈ చిత్రానికి మాధవనే స్వయంగా దర్శకత్వం వహించడంతో పాటు ప్రొడ్యూస్ కూడా చేస్తున్నారు. ఈ సినిమాలో సైంటిస్ట్ నంబి నారాయణ్‌ను ఇంటర్య్వూ చేసే జర్నలిస్ట్‌గా షారుఖ్ కనిపించబోతున్నారు. ఈ చిత్రంలో సిమ్రన్ కూడా నటిస్తున్నట్టు సమాచారం. కాగా షారుఖ్ ‘జీరో’లో మాధవన్‌ సైంటిస్ట్‌గా గెస్ట్ అప్పీయరెన్స్ ఇచ్చిన విషయం తెలిసిందే.

రణ్‌బీర్ కపూర్, అలియాభట్, అమితాబ్, మౌని రాయ్‌లు నటిస్తున్న ‘బ్రహ్మాస్త్ర’ చిత్రంలోనూ షారుఖ్ అతిథి పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో షారుఖ్ ఓపెనింగ్ సీన్‌లో ‘సైంటిస్ట్’గా కనిపించి, ఫాంటసీ వరల్డ్‌లోకి ప్రేక్షకులను తీసుకెళ్తారని సమాచారం. ఈ చిత్రంలో టాలీవుడ్ కింగ్ నాగార్జున కూడా కీలక పాత్రలో నటిస్తుండటం విశేషం. ఇదిలా ఉంటే షారుఖ్ ‘జీరో’ తర్వాత చేసే ప్రాజెక్టేది ఇంకా ఖరారు కాలేదు. రాకేష్ శర్మ బయోపిక్‌లో నటిస్తున్నట్లు వార్తలొచ్చినా.. తాను అందులో నటించడం లేదని షారుఖ్ తేల్చేశారు.


Next Story

Most Viewed