సీఎం కేసీఆర్‌కు షబ్బీర్ అలీ సూటి ప్రశ్న

by  |
సీఎం కేసీఆర్‌కు షబ్బీర్ అలీ సూటి ప్రశ్న
X

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌‌పై కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ మండిపడ్డారు. సీఏఏపై రెండ్రోజుల్లో నిర్ణయం తీసుకుంటానన్న కేసీఆర్ కేబినెట్‌లో ఎందుకు చర్చించడం లేదని సూటిగా ప్రశ్నించారు. కేసీఆర్, అసదుద్దీన్ ఓవైసీ కలిసి ప్రజలను మోసం చేస్తున్నారు తప్ప సీఏఏకు వ్యతిరేకంగా నిర్దిష్టమైన ప్రణాళికలు రూపొందించడం లేదని ఫైర్ అయ్యారు. సీఎం కేసీఆర్‌ ప్రధాని మోడీకి టోపీ పెడుదామనుకున్నారు కానీ కేసీఆర్ వ్యూహాన్ని ఆయన పసిగట్టారని పేర్కొన్నారు. సీఏఏతో ఎలాంటి నష్టం ఉండదని అమిత్ షా చెబుతున్నా ప్రజల ఆందోళనలు సద్దుమనిగే కనపడటం లేదన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ ఇవ్వకుండా కేసీఆర్ అన్యాయం చేస్తున్నారని షబ్బీర్ అలీ విమర్శించారు.


Next Story

Most Viewed