లాక్‌డౌన్: శానిటైజర్ తాగి మరో ఇద్దరు మృతి

by  |
లాక్‌డౌన్: శానిటైజర్ తాగి మరో ఇద్దరు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: నైట్ కర్ఫ్యూ, కొన్ని ప్రాంతాల్లో లాక్‌డౌన్ నేపథ్యంలో మద్యం దొరక్క మందుబాబులు నానాపాట్లు పడుతున్నారు. ఈ క్రమంలో మద్యానికి బానిసైన వారు శానిటైజర్ తాగి మరణిస్తున్న ఘటనలు ఇటీవల ఎక్కువైపోయాయి. తాజాగా అలాంటి విషాదకర ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. మహారాష్ట్రలో లాక్‌డౌన్ నేపథ్యంలో మద్యం దొరక్క శానిటైజర్ తాగి ఏడుగురు మృతి చెందారు. నిన్న ఐదుగురు చనిపోగా… తాజాగా మరో ఇద్దరు మరణించారు.

యావత్మార్ జిల్లాలోని వణీ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇంకా ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ముగ్గురికి ప్రస్తుతం హాస్పిటల్‌లో వైద్యులు చికిత్స అందిస్తున్నారు.


Next Story