కరెంట్ షాక్ తో మేకలు మృతి

by Bhanu |   (  Updated:2025-05-06 12:39:16  IST  )

విద్యుత్ షాక్ తో మూగజీవాలు మరణించిన సంఘటన మండలం లో చోటుచేసుకుంది.

కరెంట్ షాక్ తో మేకలు మృతి
X

దిశ , శంకర పట్నం : విద్యుత్ షాక్ తో మూగజీవాలు మరణించిన సంఘటన మండలం లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... శంకరపట్నం మండలంలోని చింతలపల్లి గ్రామానికి చెందిన బొంతల రాజు అను మేకల కాపరి మంగళవారం తన మేకలను మేపడానికి తీసుకువెళ్తుండగా సోమవారం సాయంత్రం ఈదురు గాలులకు విరిగిపడిన స్తంభం తీగలకు విద్యుత్ సరఫరా కావడం తో వైర్లు మూగజీవాలకు తగిలి విద్యుత్ ఘాతంతో ఆరు మూగజీవాలు ప్రాణాలు వదిలినట్లు బాధితుడు కన్నీరు మున్నీరు గా విలపిస్తూ తెలిపాడు. వాటి విలువ ఒక లక్షా ఎనభై వేల రూపాయల వరకు ఉంటుందని తెలిపాడు.

Next Story