- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
మెగాస్టార్ చిరంజీవి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసిన సినిమా సైరా నర్సింహారెడ్డి సినిమాతో తమిళ ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి తెలుగులో తెరంగేట్రం చేశాడు. దీంతో ఆయన నటనకు ఇంప్రెస్ అయిన తెలుగు చిత్ర పరిశ్రమ దర్శకులు ఆయన డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే సాయిధరమ్ సోదరుడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న 'ఉప్పెన' సినిమాలో విలన్గా నటిస్తున్నాడు. అలాగే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వచ్చే సినిమాకు కూడా ఇప్పటికే ఓకే చెప్పాడని చిత్ర పరిశ్రమలో వార్త చక్కర్లు కొడుతుంది. అయితే కరోనా మూలంగా లాక్డౌన్ విధించడంతో ఆ సినిమా షూటింగ్ ఆగిపోయింది. ఈ క్రమంలో మరికొందరు తెలుగు నిర్మాతలు విజయ్ను తమ సినిమాల కోసం సంప్రదించడంతో, ఆయన డిమాండ్ను అమాంతం పెంచారట. నిర్మాతలకు విజయ్ కండీషన్స్ పెట్టి ఇబ్బంది పెడుతున్నారని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. విజయ్ ఒక సినిమాకు రూ.8 కోట్లపైనే రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నాడట. అలాగే తాను తెలుగులో నటించిన సినిమాలను తమిళనాడులో విడుదల చేయకూడదని షరతు పెడుతున్నాడని సమాచారం. విజయ్ షరతులు విన్న తర్వాత చాలా మంది దర్శకులు వెనక్కి తగ్గుతున్నట్టు సమాచారం.