మార్కెట్‌లో వ్యాక్సిన్ ధర రూ.వేయి : పూనావాలా

by  |
మార్కెట్‌లో వ్యాక్సిన్ ధర రూ.వేయి : పూనావాలా
X

దిశ,వెబ్‌డెస్క్: సీరం నుంచి వ్యాక్సిన్ల రవాణా చారిత్రాత్మక ఘట్టం అని ఆ కంపెనీ సీఈవో అదర్ పూనావాలా అన్నారు. దేశ పౌరులందరికీ వ్యాక్సిన్ అందివ్వడమే తమ ముందున్న సవాల్ అని తెలిపారు. దేశం కోసం ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఒక్కో డోసు రూ.200లకే అందిస్తున్నామని చెప్పారు. కేంద్రానికి పది కోట్ల డోసులను సరఫరా చేస్తామని వెల్లడించారు. బహిరంగ మార్కెట్‌లో ఒక్కో డోసు ధర రూ.వెయ్యి ఉంటుందని పేర్కొన్నారు. కొవిషీల్డ్ కోసం చాలా దేశాలు పీఎంవోను సంప్రదిస్తున్నాయని చెప్పారు. ఆఫ్రికా, దక్షిణ అమెరికాకు వ్యాక్సిన్ సరఫరాకు యత్నిస్తున్నామని వివరించారు. నెలకు 7 నుంచి 8 కోట్ల డోసులను ఉత్పత్తి చేస్తామన్నారు.



Next Story

Most Viewed