రామ్‌గోపాల్ వర్మకు సెన్సార్ బోర్డు షాక్

by  |
రామ్‌గోపాల్ వర్మకు సెన్సార్ బోర్డు షాక్
X

దిశ,వెబ్‌డెస్క్: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు సెన్సార్ బోర్డు గురువారం షాక్ ఇచ్చింది. దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన దిశ హత్యాచార ఘటన ఆధారంగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘దిశ ఎన్ కౌంటర్’ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాపై అటు దిశ తల్లిదండ్రులు, నిందితుల కుటుంబ సభ్యుల నుంచి అభ్యంతరాలు వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో న్యాయస్థానం కూడా సినిమా విడుదలకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. దీంతో సినిమా విడుదలపై అనుమానాలు నెలకొన్నాయి. తాజాగా సినిమా విడుదలకు సెన్సార్ బోర్డు నో చెప్పింది. దీంతో ఈ సినిమాను రివిజన్ కమిటీ ముందుకు వెళ్లనుంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో సినిమా విడుదల అవ్వడం కష్టమే అని వార్తలు వినిపిస్తున్నాయి.

Next Story

Most Viewed