తిరిగి లాభాల్లోకి స్టాక్ మార్కెట్లు..

by  |
stock markets
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు తిరిగి లాభాలను సాధించాయి. గురువారం నాటి ట్రేడింగ్‌లో కీలక కంపెనీల షేర్లు సానుకూలంగా ర్యాలీ చేయడంతో సూచీలు రాణించాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు ఉన్నప్పటికీ రిలయన్స్, ఇన్ఫోసిస్, కోటక్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎయిర్‌టెల్ సహా పలు దిగ్గజ కంపెనీలు మార్కెట్లకు మద్దతిచ్చాయి. నవంబర్ నెలకు సంబంధించి ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ కాంట్రాక్ట్‌ల గడువు ముగియడంతో ఒడిదుడుకులను ఎదుర్కొన్నప్పటికీ ఫార్మా, రియల్టీ రంగాల నుంచి కొనుగోళ్లు పెరిగాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 454.10 పాయింట్లు ఎగసి 58,795 వద్ద, నిఫ్టీ 121.20 పాయింట్లు పెరిగి 17,536 వద్ద ముగిసింది.

నిఫ్టీలో బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ, కేపిటల్ గూడ్స్ రంగాలు బలహీనపడగా, ఆటో, ఐటీ, ఫార్మా రంగాల్లో కొనుగోళ్లు జరిగాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో రిలయన్స్ అధికంగా 6 శాతం పుంజుకోగా, ఐటీసీ, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, కోటక్ బ్యాంక్, టైటాన్ షేర్లు లాభాలను సాధించాయి. ఇండస్ఇండ్ బ్యాంక్, మారుతీ సుజుకి, ఐసీఐసీఐ బ్యాంక్, హిందూస్తాన్ యూనిలీవర్, బజాజ్ ఆటో, యాక్సిస్ బ్యాంక్, ఎల్అండ్‌టీ, ఎస్‌బీఐ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 74.52 వద్ద ఉంది.


Next Story

Most Viewed