స్వల్ప నష్టాల్లో మార్కెట్లు

by  |
స్వల్ప నష్టాల్లో మార్కెట్లు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు బుధవారం స్వల్ప నష్టాల్లో ముగిశాయి. గత కొన్నిరోజులుగా కొనసాగుతున్న లాభాల నేపథ్యంలో బుధవారం మదుపర్లు లాభాల స్వీకరణకు సిద్ధపడ్డారు. ఉదయం లాభాలతో ప్రారంభమైన తర్వాత మిడ్‌సెషన్ వరకు అదే ధోరణి కొనసాగించిన సూచీలు చివరి గంటలో స్వల్ప నష్టాలవైపు కదలాడాయి. ఓ దశలో గరిష్ఠ స్థాయిలను చేరుకున్న తర్వాత అమ్మకాల ఒత్తిడికి సూచీలు డీలాపడ్డాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 19.69 పాయింట్లు నష్టపోయి 51,309 వద్ద ముగియగా, నిఫ్టీ 2.80 పాయింట్లు కోల్పోయి 15,106 వద్ద ముగిసింది.

నిఫ్టీలో ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు, ఎఫ్ఎంసీజీ, ఫైనాన్సియల్, మెటల్ రంగాలు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో బజాజ్ ఫిన్‌సర్వ్, ఎంఅండ్ఎం, బజాజ్ ఫైనాన్స్, టీసీఎస్, రిలయన్స్, హిందూస్తాన్ యూనిలీవర్ షేర్లు లాభాలను దక్కించుకోగా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, యాక్సిస్ బ్యాంక్, ఓఎన్‌జీసీ, నెస్లె ఇండియా, ఎల్అండ్‌టీ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 72.86 వద్ద ఉంది.

51 వేలను దాటిన సెన్సెక్స్

Next Story

Most Viewed