పొత్తూరికి ప్రముఖుల నివాళి..

by  |
పొత్తూరికి ప్రముఖుల నివాళి..
X

ప్రముఖ సీనియర్ జర్నలిస్టు పొత్తూరి వెంకటేశ్వరరావు మృతిపట్ల పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఇరు తెలుగు రాష్ర్టాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్‌లు పొత్తూరు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిలు నివాళ్లర్పించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మట్లాడుతూ.. పత్రికా, సామాజిక సేవా రంగాల్లో ఆయన చేసిన కృషిని, అందించిన సేవలను కొనియాడారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ పొత్తూరి అందించిన నైతిక మద్దతును కేసీఆర్ గుర్తుచేసుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు.

Tags: Senior journalist Pothuri venkateshwara rao, dies, mourning, cm jagan,kcr, etala rajendar, vijayasaireddy

Next Story

Most Viewed