కాంగ్రెస్‌కు షాక్.. ఐసీయూలో చేరిన వీహెచ్!

by  |
v hanumantarao news
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు అస్వస్థతకు గురయ్యారు. అనారోగ్యంతో ఆయన శనివారం రాత్రి హైద‌రాబాద్‌లోని అపోలో ఆసుప‌త్రిలో చేరారు. గతకొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్న వీహెచ్.. ఆ కారణంగానే అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. ఆసుపత్రిలో చేరిన వీహెచ్ కు వైద్యులు కొన్ని పరీక్షలు చేసినట్లు సమాచారం. ఆయన పరిస్థితి కొంచెం విషమంగానే ఉందని తెలుస్తోంది. ఇక ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నేతలు వీహెచ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. కాగా.. ఇటీవలే వీ హనుమంతరావు కరోనా బారిన పడి కోలుకున్న విషయం తెలిసిందే. ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితిపై పూర్తి స‌మాచారం ఇంకా అందాల్సి ఉంది.


Next Story

Most Viewed