మద్యం మత్తులో సరదాకు ‘సెల్ఫీ’ వీడియో.. షాక్‌లో పోలీసులు

by  |
మద్యం మత్తులో సరదాకు ‘సెల్ఫీ’ వీడియో.. షాక్‌లో పోలీసులు
X

దిశ, షాద్ నగర్ : రాష్ట్రంలో లాక్‌డౌన్ కొనసాగుతోంది. ఎక్కడికీ వెళ్లడం లేదు. ఇంట్లోనే ఉంటున్నాం కదా అని.. అలా సరదాగా బయటికి వెళ్ళి ఓ చెట్టు కింద కూర్చొని పెగ్గేశారు ఇద్దరు స్నేహితులు. మద్యం తాగిన తర్వాత వారికి ఓ వింత ఐడియా వచ్చింది. వెంటనే అమలు దాన్ని అమలు చేయాలనుకున్నారు. ఇంతకీ ఏం చేయాలనుకున్నారో తెలుసా.?

ఉరివేసుకున్న సీన్ వీడియో తీయాలనుకున్నారు. ఇంకేముంది.. ఒక త్రాడు తీసుకువచ్చి చెట్టుకు కొమ్మకు కట్టి ఉరివేసుకుని ఆ సన్నివేశాలను సరదాగా తమ మొబైల్‌‌తో వీడియో తీసుకున్నారు. ఆ వీడియో కాస్త వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గం నందిగామ మండల పరిధిలోని అప్పరెడ్డిగూడ గ్రామానికి చెందిన పుల్లనోళ్ల జగన్, చాకలి శ్రీనులు మిత్రులు.

ఈ నెల 26న వీర్లపల్లి గ్రామ శివారులోని ఓ చెట్టు కింద ఇద్దరూ మద్యం సేవించారు. అనంతరం సరదాగా చెట్టుకు ఉరివేసుకున్నట్లు నటించి దాన్ని తమ మొబైల్‌లో చిత్రీకరించారు. ఆ వీడియో వైరల్ కావడంతో జగన్ తండ్రి పుల్లనోళ్ల రామయ్య.. చాకలి శ్రీను తమ కుమారుడిని చంపాలని చూసినట్లు ఈ నెల 28న నందిగామ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రామయ్య తెలిపారు.

Next Story

Most Viewed