తాడిపత్రిలో భారీగా బంగారం పట్టివేత

by  |
heavy gold
X

దిశ, వెబ్‌డెస్క్: కర్నూలు జిల్లాలో భారీగా బంగారం పట్టుబడింది. గుట్టుచప్పుడు కాకుండా బస్సులో అక్రమంగా తరలిస్తున్న 14.8 కిలోల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివరాళ్లోకి వెళితే.. పంచలింగాల చెక్‌పోస్టు వద్ద శుక్రవారం ఉదయం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్ నుంచి తాడిపత్రికి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని స్వాధీనం చేసుకొని, సరైన పత్రాలు లేకపోవడంతో సీజ్ చేశారు. అంతేగాకుండా తరలిస్తున్న రాజు అనే యువకుడిని అదుపులోకి తీసుకొని విచారించగా, బంగారం వ్యాపారి రామకృష్ణారెడ్డి దగ్గర పనిచేస్తున్నట్టు వెల్లడించాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు.


Next Story

Most Viewed