కౌంటింగ్ కేంద్రంలోకి ఫోన్.. ఎక్కడ పెట్టుకొచ్చాడంటే..?

by  |
కౌంటింగ్ కేంద్రంలోకి ఫోన్.. ఎక్కడ పెట్టుకొచ్చాడంటే..?
X

దిశ, తెలంగాణ బ్యూరో : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మరో ఉల్లంఘన చోటు చేసుకుంది. ఎన్నికల నిర్వాహణపై అనేక రకాల ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఎంఐఎం పార్టీ అభ్యర్థి భర్త సెల్ ఫోన్‌తో కౌంటింగ్ కేంద్రంలోకి రావడం వివాదస్పదమైంది. నిబంధనల ప్రకారం కౌంటింగ్ కేంద్రంలోకి సెల్‌ఫొన్లు తీసుకురావడం నిషేధం.

అయితే, శుక్రవారం ఓట్ల లెక్కింపు సందర్భంగా కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలోకి ఓ వ్యక్తి సెల్‌ఫోన్‌తో వచ్చారు. ఆయన ఎంఐఎం అభ్యర్థి షాహీనా బేగం భర్త షరీఫ్. షూ సాక్స్‌లో మొబైల్ పెట్టుకుని ఎవరికీ కనిపించకుండా కౌంటింగ్ కేంద్రంలోనికి వచ్చాడు. కానీ, సాక్స్‌లో మొబైల్ దాచినట్లు స్పష్టంగా కనిపించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

Next Story

Most Viewed