ద్వారకా తిరుమలలో దారుణం.. భిక్షాటన చేస్తున్న యాచకుల‌పై దాడి

by  |
ద్వారకా తిరుమలలో దారుణం.. భిక్షాటన చేస్తున్న యాచకుల‌పై దాడి
X

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయ కొండపై అమానుష ఘటన వెలుగుచూసింది. గుడి బయట భిక్షాటన చేస్తున్న యాచకులపై సెక్యూరిటీ సిబ్బంది ప్రతాపం చూపించారు. ఆలయానికి వచ్చే భక్తులను డబ్బులు ఇవ్వాలని ఇబ్బంది పెడుతున్నారన్న నేపంతో కర్రలతో దాడి చేశారు. ఈ దాడిలో యాచకులకు గాయాలు అయ్యాయి. దెబ్బలు తాళలేక వారు అక్కడి నుంచి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.



Next Story

Most Viewed