ఓబుళాపురం గనుల వద్ద రెండో రోజు సర్వే

by  |
ఓబుళాపురం గనుల వద్ద రెండో రోజు సర్వే
X

దిశ, వెబ్‎డెస్క్ : ఆంధ్ర-కర్నాటక సరిహద్దులోని ఓబుళాపురం గనుల వద్ద రెండో రోజు సర్వే కొనసాగుతోంది. అక్రమ మైనింగ్‌తో కేసులు ఎదుర్కొంటోన్న గాలి జనార్ధనరెడ్డి.. మైనింగ్ సరిహద్దులు ధ్వంసం చేసిన ప్రాంతంలో రీ సర్వేను నిర్వహిస్తున్నారు. వివాదాస్పద ఓబుళాపురం, సిద్ధాపురం, మల్పనగుడి ప్రాంతాల్లో సర్వే కొనసాగుతోంది. ఈ సర్వేలో ఏపీ, కర్ణాటక రాష్ట్రానికి చెందిన 60 మంది సిబ్బంది పాల్గొన్నారు. వందేళ్ల నాటి గెజిట్లు, భూపటాలను, రికార్డులను అధికారులు పరిశీలిస్తున్నారు. సర్వే అనంతరం హద్దులు నిర్ణయించి 110 చోట్ల పిల్లర్లు వేయాలని సర్వేఆఫ్ ఇండియా నిర్ణయించుకుంది.



Next Story

Most Viewed