టీడీపీకి షాకిచ్చిన ఏపీ ఎస్ఈసీ

by  |
ap sec
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ విడుదల చేసిన మేనిఫెస్టోపై ఎస్ఈసీ షాక్ ఇచ్చింది. వెంటనే మేనిఫెస్టోను ఉపసంహరించుకోవాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ గురువారం ఆదేశాలు జారీ చేశారు. మేనిఫెస్టో విడుదలపై ఫిర్యాదులు, టీడీపీ వివరణను పరిశీలించిన ఎస్ఈసీ… టీడీపీ వివరణ సంతృప్తికరంగా లేదని పేర్కొంది. జిల్లాలకు పంపిన మేనిఫెస్టోను కాపీలను వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరింది. అదేవిధంగా మేనిఫెస్టోతో ఎలాంటి ప్రచారం నిర్వహించొద్దని స్పష్టం చేసింది. గ్రామ పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితంగా జరుగుతాయని, రాజకీయ పార్టీలు మేనిఫెస్టోలు ప్రకటించ కూడదని తెలిపింది. వారంరోజుల క్రితం పంచాయతీ ఎన్నికల టీడీపీ మేనిఫెస్టోను చంద్రబాబు విడుదల చేసిన విషయం తెలిసిందే.



Next Story