ప్రలోభాల నివారణకు ఐఏఎస్​, ఐపీఎస్​లు

by  |
ప్రలోభాల నివారణకు ఐఏఎస్​, ఐపీఎస్​లు
X

దిశ, తెలంగాణ బ్యూరో : గ్రేటర్​ ఎన్నికల్లో ప్రలోభాల పర్వంపై రాష్ట్ర ఎన్నికల సంఘం అత్యవసరంగా స్పందించింది. పలు చోట్ల నోట్ల పంపిణీ యథేచ్ఛగా సాగుతున్న అంశాలు దృష్టికి రావడంతో నిఘా పెంచేందుకు ఏర్పాట్లు చేసింది. దీని కోసం సోమవారం నుంచి ప్రత్యేకాధికారులను నియమించింది. వారి ఫోన్​ నెంబర్లను అందుబాటులో పెట్టింది. సర్కిళ్ల వారీగా అధికారులను కేటాయించింది. మొత్తం 12 మంది ఉన్నతాధికారులకు ఈ బాధ్యతలను అప్పగించారు.

టీఆర్​ఎస్​ పార్టీ నుంచి భారీగా నగదు పంపిణీ చేస్తున్నారంటూ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. కొన్నిచోట్ల పోలీసులే నగదు పంపిణీ చేస్తున్నారంటూ బీజేపీ స్టేట్​ చీఫ్​ సంజయ్​ ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో ప్రలోభాల పర్వాన్ని అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్నికల సంఘం కమిషనర్​ పార్థసారధి ప్రకటించారు. రాజకీయ పార్టీలు, కార్యకర్తలు ఎన్నికల అక్రమాలకు పాల్పడినా, ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనలకు పాల్పడినా, మరే ఇతర ఫిర్యాదులు ఉన్నా సంబంధిత ఎన్నికల పరిశీలకులకు ఫిర్యాదు చేయాలని ఎస్​ఈసీ పార్థసారధి కోరారు.

Next Story

Most Viewed