గ్రేటర్‌ నోటిఫికేషన్‌పై ఎస్ఈసీ క్లారిటీ !

by  |
గ్రేటర్‌ నోటిఫికేషన్‌పై ఎస్ఈసీ క్లారిటీ !
X

దిశ, వెబ్‌డెస్క్: గ్రేటర్ ఎన్నికల నోటిఫికేషన్‌పై రాష్ట్ర ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం ఎన్నికల సన్నాహక ప్రక్రియ ప్రారంభమైందని, ఈనెల 13న తుది ఓటర్ల జాబితా ప్రకటించి, ఎప్పుడైనా నోటిఫికేషన్ జారీ చేస్తామని ఎన్నికల కమిషనర్‌ పార్థసారథి తెలిపారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారుల శిక్షణ శిబిరంలో మంగళవారం ఎస్ఈసీ పాల్గొని మాట్లాడారు. 150వార్డులకు 150మంది రిటర్నింగ్ అధికారులు ఉంటారని, ఒక్కో వార్డు పరిధిలో 50పోలింగ్ కేంద్రాలు ఉంటాయని స్పష్టం చేశారు. పోలింగ్ కేంద్రాల్లో వీడియో, వెబ్ కాస్టింగ్‌కు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.



Next Story

Most Viewed