8వ తరగతి వరకు బడులు బంద్..

by  |
8వ తరగతి వరకు బడులు బంద్..
X

దిశ, వెబ్ డెస్క్ : దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా పుదుచ్చేరిలో కరోనా కేసులు ఎక్కువ సంఖ్యలో నమోదు అవుతుండటంతో.. రాష్ట్ర ప్రభుత్వం కరోనా కట్టడికి తగు చర్యలు తీసుకుంటోంది. ఈ నెల 22 నుండి 8వ తరగతి వరకు పాఠశాలలను మూసివేస్తున్నట్టు ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. అయితే 9,10, ఇంటర్ విద్యార్ధులకు వారంలో 5 రోజులు మాత్రమే క్లాసులు జరుగుతాయని అధికారులు వెల్లడించారు. ఇప్పటికే పుదుచ్చేరిలో 1 నుండి 9వ తరగతి వరకు విద్యార్ధులను పై తరగులకు ప్రమోట్ చేస్తున్నట్టు లెఫ్ట్‌నెంట్ గవర్నర్ తమిళ సై ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.

Next Story

Most Viewed