- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
SBI Alerts: కస్టమర్లకు డిజిటల్ సేవల్లో అంతరాయం
<p>దిశ, వెబ్డెస్క్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) కీలక ప్రకటన విడుదల చేసింది. శుక్రవారం (మే 21, రాత్రి 22.45) నుంచి శనివారం(మే 22, అర్ధరాత్రి 1.15) వరకు రెండు గంటల పాటు బ్యాంకు సేవల్లో అంతరాయం కలుగుతుందని స్పష్టం చేసింది. ఆ తర్వాత ఆదివారం (మే 23వ తేది) తెల్లవారుజామున 2.40 గంటల నుంచి ఉ. 6.10 గంటల(దాదాపు మూడున్నర గంటలు) పాటు బ్యాంకు సేవలు పనిచేయవని చెప్పింది. వివిధ నిర్వహణ పనుల నేపథ్యంలో ఈ […]</p>

దిశ, వెబ్డెస్క్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) కీలక ప్రకటన విడుదల చేసింది. శుక్రవారం (మే 21, రాత్రి 22.45) నుంచి శనివారం(మే 22, అర్ధరాత్రి 1.15) వరకు రెండు గంటల పాటు బ్యాంకు సేవల్లో అంతరాయం కలుగుతుందని స్పష్టం చేసింది. ఆ తర్వాత ఆదివారం (మే 23వ తేది) తెల్లవారుజామున 2.40 గంటల నుంచి ఉ. 6.10 గంటల(దాదాపు మూడున్నర గంటలు) పాటు బ్యాంకు సేవలు పనిచేయవని చెప్పింది. వివిధ నిర్వహణ పనుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని.. ముఖ్యంగా ఈ మూడు రోజుల్లో పైన తెలిపిన సమయాల్లో యోనో, యోనో లైట్, యూపీఐ, ఇంటర్ నెట్ బ్యాంకింగ్ తదితర సేవలు అందుబాటులో ఉండవని ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ సమయాల్లో కస్టమర్లు లావాదేవీలను చేయకూడదని.. అత్యవసరం ఉంటే అంతకు ముందే జాగ్రత్త పడాలని సూచించింది.
We request our esteemed customers to bear with us as we strive to provide a better banking experience.#SBI #StateBankOfIndia #ImportantNotice #InternetBanking #OnlineSBI pic.twitter.com/LNMnKjORMR
— State Bank of India (@TheOfficialSBI) May 20, 2021






