సావర్కర్ నగర్ పార్క్ స్థలం కబ్జా ?

by  |
kabja
X

దిశ, ఉప్పల్ ; కాప్రా సర్కిల్ నాచారం డివిజన్ పరిధిలోని సావర్కర్ నగర్ పార్కు స్థలం కబ్జాకు గురవుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. జిహెచ్ఎంసి పార్క్ స్థలం పరిరక్షణకోసం కాలనీ సంక్షేమ సంఘం కోర్డుకు వెళ్లి కబ్జాకు గురికాకుండా చూశారు. అయితే నేడు అదే కాలనీ సంఘం బిల్డరుకు అమ్ముకున్నారనే విమర్శలు వినిపిస్తోన్నాయి. కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు నరేష్ శుక్ల, బిల్డర్ ఈశ్వర్ ప్రసాద్ లను పార్కు స్థలం గురించి అడిగితే మీరెవరు అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా జిహెచ్ఎంసి అధికారులు స్పందించి పార్కు స్థలంలో వెలుస్తున్న నిర్మాణాన్ని అడ్డుకుని పార్కు స్థలాన్ని పరిరక్షించాలని పలువురు కోరుతున్నారు.

Next Story

Most Viewed