- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
న్యూఢిల్లీ: గోవా గవర్నర్ సత్యపాల్ మాలిక్ మేఘాలయా గవర్నర్గా బదిలీ అయ్యారు. రెండేళ్లు త్రిపురకు తర్వాత మూడేళ్లు మేఘాలయకు గవర్నర్గా సేవలందించి ఐదేళ్ల కాలాన్ని ముగించుకున్న తథాగత రాయ్ స్థానంలో సత్యపాల్ మాలిక్ వెళ్లనున్నారు. కాగా, మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కొశ్యారీ గోవా గవర్నర్గా అదనపు బాధ్యతలు తీసుకోనున్నట్టు రాష్ట్రపతి భవన్ నుంచి వెలువడిన ప్రకటన పేర్కొంది. జమ్ము కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తినిచ్చే అధికరణం 370 నిర్వీర్యం చేసినప్పుడు ఆ రాష్ట్రానికి సత్యపాల్ మాలిక్ గవర్నర్గా విధులు నిర్వహించిన సంగతి తెలిసిందే. అనంతరం గోవా గవర్నర్గా బదిలీ అయ్యారు. జమ్ము కశ్మీర్కు ఏడాది కాలంగా గవర్నర్గా సేవలందించడానికి పూర్వం బీహార్ గవర్నర్గా కొనసాగారు. మొత్తంగా సత్యపాల్ మాలిక్ రెండేళ్ల కాలంలో మూడు సార్లు బదిలీ అయ్యారు.
Next Story