నన్ను చూస్తే వాళ్లకు వణుకు: శశికళ

by Shamantha N |
నన్ను చూస్తే వాళ్లకు వణుకు: శశికళ
X

దిశ, వెబ్‌డెస్క్: అన్నాడీఎంకే నేతలపై శశికళ తీవ్ర విమర్శలు చేశారు. నన్ను చూసి అన్నాడీఎంకే నేతలు వణికిపోతున్నారని మండిపడ్డారు. నేను ఎవరికి భయపడనని, జయలలిత వారసురాలిని నేనేనంటూ వ్యాఖ్యానించిన శశికళ.. ప్రత్యక్ష రాజకీయాల్లో నా పాత్ర కీలకమని చెప్పుకొచ్చారు. 4ఏళ్ల జైలు శిక్ష అనంతరం బెంగళూరు నుంచి చెన్నె తిరిగి వచ్చిన శశికళకు ఆమె అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. అయితే ఇటీవల అన్నాడీఎంకే నేతలు శశికళను విమర్శించడంతో.. ఇవాళ చెన్నైలో అడుగుపెట్టిన ఆమె అన్నాడీఎంకే నేతలపై తీవ్రంగా మండిపడ్డారు.

Next Story

Most Viewed