ఉపాధ్యాయుడిగా మారిన సర్పంచ్

by  |
ఉపాధ్యాయుడిగా మారిన సర్పంచ్
X

దిశ, స్టేషన్ ఘన్ పూర్: కరోనా వలన పాఠశాలలు మూతపడి ఎంతో మంది పిల్లలు రోడ్లమీద తిరుగుతూ కాలక్షేపం చేస్తున్నారు. అలాంటి వారికి చదువు చెప్పాలని నిర్ణయించుకున్నాడు ఓ సర్పంచ్. అలానే బడికి దూరమైన పిల్లలను అక్కున చేర్చుకుని ప్రతిరోజు వారికి పాఠాలు చెబుతూ టీచర్ అయ్యాడు లింగంపల్లి సర్పంచ్ ఎదునూరి రవీందర్.

వివరాలు… జనగామ జిల్లా చిల్పూర్ మండలం లింగంపల్లి గ్రామ సర్పంచ్ ఎదునూరి రవీందర్ గ్రామంలో 5 పాజిటివ్ కేసులు రాగా ఆ కుటుంబాలను హోం హై సోలేషన్‌లో ఉంచారు. కరోనా వ్యాప్తి భయంతో పాఠశాలలు మూతపడడంతో తన ఇంటి సమీపంలోని పిల్లలందరూ వీధి వెంబడి తిరుగుతుండడం గమనించారు. దీంతో గత మూడు రోజులుగా తన ఇంటి వద్ద కూర్చోబెట్టుకొని సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ చదువు నేర్పుతున్నాడు.



Next Story