‘సర్కారు వారి పాట’లు.. ఆన్ ది వే!

by  |
‘సర్కారు వారి పాట’లు.. ఆన్ ది వే!
X

దిశ, సినిమా: సూపర్ స్టార్ మహేశ్ బాబు ‘సర్కారు వారి పాట’ చిత్రీకరణ దుబాయ్‌లో శరవేగంగా జరుగుతోంది. కీర్తి సురేశ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు పరశురాం దర్శకులు కాగా.. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ సినిమాస్ నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్న థమన్, ఆల్బమ్ గురించి లేటెస్ట్ అప్‌డేట్ ఇచ్చాడు. డైరెక్టర్ పరశురాం, సినిమాటోగ్రాఫర్ మ్యాడీతో కలిసి ఉన్న పిక్ షేర్ చేసిన థమన్.. థర్డ్ కంపోజింగ్ సెషన్స్ కంప్లీట్ అయ్యాయని తెలిపాడు. ఈ మేరకు ‘అదిరిపోయే మ్యూజిక్ ఆన్ ది వే’ అంటూ పోస్ట్ పెట్టాడు. దీనిపై స్పందించిన మహేశ్ అభిమానులు.. మూవీ టైటిల్ కార్డ్స్ నుంచి ఎండింగ్ వరకు మ్యూజిక్ ఓ రేంజ్‌లో ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. బీజీఎం, సాంగ్స్ గూస్ బంప్స్ వచ్చేలా ప్లాన్ చేయమని సూచిస్తున్నారు.

https://twitter.com/MusicThaman/status/1359799740842602500?s=20


Next Story

Most Viewed