మహేశ్ ‘సర్కార్ వారి పాట’ స్టార్ట్

by  |
మహేశ్ ‘సర్కార్ వారి పాట’ స్టార్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ షూటింగ్ షురూ అయింది. పరశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ కాగా.. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్స్ నిర్మిస్తున్నాయి. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ దుబాయ్‌లో ప్రారంభం అయినట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు ఫిల్మ్ మేకర్స్. సర్కార్ వారి వేలం పాట మొదలైందంటూ అప్ డేట్ ఇచ్చారు. లాక్ డౌన్ కారణంగా వాయిదా పడిన చిత్రీకరణ.. ఆ తర్వాత యూనిట్ సభ్యు వీసా సమస్యలతో మరో సారి డిలే కాగా.. ఎట్టకేలకు జనవరి 25న స్టార్ట్ అయింది. ఎస్.ఎస్.థమన్ సంగీతం సమకూరుస్తున్నారు.

https://twitter.com/MythriOfficial/status/1353561145227919360?s=20

Next Story

Most Viewed