‘సరిలేరు నీకెవ్వరు’ 50 రోజుల పండుగ

by  |
‘సరిలేరు నీకెవ్వరు’ 50 రోజుల పండుగ
X

ఈ మధ్య కాలంలో సినిమా వారం రోజులు ఆడటమే గగనం అయిపోతుంది. ఇప్పుడు సినిమా సక్సెస్‌ను రూ.50 కోట్ల క్లబ్, రూ.100 కోట్ల క్లబ్ అనే లెక్కల మీద నిర్ణయిస్తున్నారే తప్ప ఇన్ని రోజులు ఆడింది అని చెప్పుకునే కాలం పోయింది. ఒకప్పుడు సినిమా 50 రోజులు, 100 రోజులు, 365 రోజులు ఆడిందని చెప్పుకునే వారు. చిత్ర యూనిట్ విజయయాత్రలు చేసేది. కానీ, ఇప్పుడు ఒక్క రోజు సినిమా ఆడితేనే సక్సెస్ మీట్లు, థాంక్స్ మీట్లు పెట్టేస్తున్నారు సినిమా వాళ్లు. ఇన్నాళ్ల తర్వాత సంక్రాంతికి వచ్చిన సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’ 50 రోజుల సక్సెస్ ఈవెంట్ ప్లాన్ చేసింది టీం. నటీనటులు, టెక్నీషియన్స్, డిస్ట్రిబ్యూటర్లను ఆహ్వానించింది. మార్చి 1న కర్నూలులో జరుగనున్న ఈ కార్యక్రమంలోనే ఏరియా వైజ్‌గా మూవీ కలెక్షన్లను అధికారికంగా ప్రకటించనున్నారు. కాగా… అల వైకుంఠపురములో టీం ఫేక్ కలెక్షన్లు ప్రకటిస్తుందని నిర్మాతల మండలిలో ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ యూనిట్ ఫిర్యాదు చేసింది. దీంతో ఫేక్ కలెక్షన్లకు చెక్ పెట్టేందుకు ఓ వెబ్‌సైట్‌ను క్రియేట్ చేసి సినిమా కలెక్షన్లను అధికారికంగా ప్రకటించేందుకు నిర్ణయించారు. అల్లు అరవింద్, సురేష్ బాబు, దిల్ రాజు లాంటి నిర్మాతలు ఓ కమిటీగా ఏర్పడి వెబ్ సైట్‌లో సినిమా కలెక్షన్లు ప్రకటించాలని నిర్ణయించినట్టు సమాచారం.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed