సంతోష్ బాబు అంత్యక్రియలు కాస్త ఆలస్యం

by  |
సంతోష్ బాబు అంత్యక్రియలు కాస్త ఆలస్యం
X

దిశ, నల్లగొండ: కల్నల్ సంతోష్ బాబు మరణంతో సూర్యాపేట దుఖ సాగరంలో మునిగిపోయింది. జిల్లా అంతటా విషణ్ణ వదనాలతో మూగబోయింది. సోమవారం రాత్రి చైనా-భారత్ సరిహద్దులో జరిగిన ఘర్షణలో సూర్యాపేట వాసి సంతోష్ బాబు అమరుడైన సంగతి తెలిసిందే. అయితే కల్నల్ సంతోష్ మృతి అంత్యక్రియలు వాస్తవానికి సాయంత్ర 6 గంటల్లోపు పూర్తి కావాల్సి ఉంది. కానీ, మృతదేహం రావడంలో ఆలస్యమైంది. మధ్యాహ్నాం 3.30 గంటలకు హైదరాబాద్ హకీంపేటకు చేరుకోవాల్సిన సంతోష్ బాబు మృతదేహం ఆలస్యంగా చేరుకుంది. దీంతో అక్కడి నుంచి రాత్రి 8 గంటల వరకు సూర్యాపేటకు చేరుకోనుంది. జిల్లా కేంద్రానికి సమీపంలో ఉండే క్యాసారం గ్రామంలోని సంతోష్ బాబు వ్యవసాయ క్షేత్రంలోనే అధికారులు అంత్యక్రియలకు ఏర్పాటు చేశారు. సూర్యాపేట కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, ఎస్పీ భాస్కరన్, ఆర్మీ ఉన్నతాధికారులు ఈ మేరకు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆర్మీ, ప్రభుత్వ, అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరుగుతాయని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు.



Next Story

Most Viewed