- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, సినిమా : బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ – టాలెంటెడ్ హీరోయిన్ ఆలియా భట్ కాంబోలో వస్తున్న ‘గంగూబాయి కతియావాడి’ సినిమా డైరెక్ట్గా ఓటీటీలోనే విడుదలవుతుందని బీ టౌన్లో టాక్ నడుస్తోంది. కొవిడ్ సెకండ్ వేవ్ కారణంగా మహారాష్ట్రలో రోజురోజుకీ కేసులు పెరిగిపోతున్నందున మేకర్స్ ఓటీటీ వైపు మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది. అయితే ఈ విషయాలపై మూవీ యూనిట్ నుంచి ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు.
కాగా ఇప్పటికే రిలీజైన టీజర్లో కామతిపుర రాణిగా ఆలియా అదరగొట్టగా, తాజాగా తెలుగు టీజర్ కూడా విడుదలైన సంగతి తెలిసిందే. నిజానికి ఈ సినిమా జులై 30న విడుదల కావాల్సి ఉండగా.. ఎట్టి పరిస్థితుల్లోనూ థియేట్రికల్ రిలీజే ఉంటుందని డైరెక్టర్ సంజయ్ సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. ఇందుకు కారణాన్ని కూడా వెల్లడించాయి. ‘గంగూబాయి కతియావాడి’ సినిమా థియేటర్ రిలీజ్ కోసమే రెండేళ్ల నుంచి డైరెక్టర్ ప్లాన్ చేశారని, ఓటీటీ రిలీజ్ కోసం ఆయన ‘హీరామండి’ పేరిట వేశ్యా గృహాలకు సంబంధించిన మరో స్టోరీని తెరకెక్కిస్తారని పేర్కొన్నారు.