డబ్బావాలాలకు బాలీవుడ్ హీరోల సాయం!

by  |
డబ్బావాలాలకు బాలీవుడ్ హీరోల సాయం!
X

కరోనా మహమ్మారి చాలా మందికి ఉపాధి లేకుండా చేసింది. ఇప్పటికీ అన్ని రంగాలపై కరోనా ప్రభావం ఉండగా.. లాక్‌డౌ‌న్ ఎత్తేసినా సరే, కొందరు పనిలేక పస్తులుంటూ, నీళ్లు తాగి రోజులు గడుపుతున్నారు. అలాంటి వారిని ఆదుకునేందుకు స్నేహ హస్తం అందించారు బాలీవుడ్ హీరోలు సంజయ్ దత్, సునీల్ శెట్టి.

కరోనా టైమ్‌లో ప్రజలు ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. ఈ టైమ్‌లో బయట ఫుడ్ తినేందుకు ఆలోచిస్తున్నారు. దీంతో డబ్బావాలాల వ్యాపారం నష్టపోయి.. కనీసం తిండికి కూడా డబ్బులు దొరికే వీల్లేకుండా పోయింది. వీరి పరిస్థితిని గమనించిన హీరోలు సంజయ్ దత్, సునీల్ శెట్టిలు ముంబైలో ఉన్న డబ్బావాలాలను ఆదుకునేందుకు ముందుకొచ్చారు. మంత్రి అస్లమ్ షేక్‌తో కలిసి కష్టాల్లో ఉన్న కుటుంబాలకు సాయమందించారు. దాదాపు 800 కుటుంబాలకు మూడు నెలలకు సరిపడా బియ్యం, పప్పు, చక్కెర, గోధుమ పిండి, నూనెతో పాటు మరిన్ని నిత్యావసర సరుకులు పంపిణీ చేసి దాతృత్వాన్ని చాటుకున్నారు.



Next Story