కూతురుతో కలిసి సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి నిరసన

by  |
MLA Jaggareddy
X

దిశ, వెబ్‌డెస్క్ : సంగారెడ్డి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తన కూతురు జయారెడ్డితో కలిసి అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసనకు దిగారు. గురువారం లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ఉన్న ఆయన నియోజకవర్గ సమస్యలను ప్లకార్డులపై ప్రదర్శిస్తూ నిరసన చేపట్టారు. సంగారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. సంగారెడ్డికి మెడికల్‌ కాలేజీ మంజూరు చేయాలని, నియోజకవర్గ అభివృద్ధికి రూ.వెయ్యి కోట్లు కేటాయించాలని, పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్లకార్డులు కోరారు. అనంతరం అంబేడ్కర్‌ విగ్రహం నుంచి అసెంబ్లీ వరకు పాదయాత్ర నిర్వహించనున్నారు. జగ్గారెడ్డి ప్రభుత్వాన్ని ఇంకా ఏం డిమాండ్ చేశారో చూడాలంటే ఈ కింది వీడియోని క్లిక్ చేయండి.

Next Story