వారికి ఇస్తే నాకే అభ్యంతరం లేదు : జగ్గారెడ్డి

by  |
వారికి ఇస్తే నాకే అభ్యంతరం లేదు : జగ్గారెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీపీసీసీ పదవి సీనియర్లకు ఇస్తే.. తనకు ఎలాంటి అభ్యంతరం లేదని, కొత్త వాళ్లకు ఇస్తే పార్టీ మూడు ముక్కలుగా చీలిపోతుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పీసీసీ పదవికి తాను పూర్తి స్థాయిలో అర్హుడిని అని, పార్టీలు మారనివారికే పదవి ఇవ్వాలని సూచించారు. అంతేగాకుండా దీనిపై ఎల్లుండి ఢిల్లీకి వెళ్తానని, తనతో పాటు మిగిలిన నేతలు కూడా వస్తారని అన్నారు. మరోసారి పీసీసీ అభ్యర్థిపై చర్చ జరిగితేనే బావుంటుందని రాష్ట్ర నేతలకు సూచించారు. సోషల్ మీడియా ప్రచారకులు పదవికి పనికిరారని, అభ్యర్థి విషయంలో హైకమాండ్ నిర్ణయం అనంతరం తన కార్యాచరణపై ఆలోచిస్తామని వెల్లడించారు.

Next Story

Most Viewed