సంగారెడ్డి చేపలు జూపార్కుకు

by  |
సంగారెడ్డి చేపలు జూపార్కుకు
X

దిశ, మెదక్: లాక్‎డౌన్ ఎఫెక్ట్ అన్ని రంగాలపై ప్రభావాన్ని చూపుతోంది. కరోనా మహమ్మారిని అరికట్టేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్‎డౌన్ కారణంగా సంగారెడ్డి జిల్లాలోని మహబూబ్ సాగర్ చెరువులోని చేపలను జూపార్కుకు తరలిస్తున్నారు . ప్రస్తుతం హైదరాబాద్‎లో చేపల మార్కెట్లతో పాటు ఇతర దుకాణాలు మూసి వేశారు . దీంతో జూ పార్కులో జంతువులు , పక్షుల పోషణకు ఇబ్బందిగా మారింది. అయితే, సంగారెడ్డి జిల్లా నుంచి చేపలను పంపాలని జూ పార్కు అధికారులు కోరారు. ఇందుకు జిల్లా మత్స్య శాఖ అధికారిణి సుజాత అంగీకరం తెలిపారు. ఈ నేపథ్యంలో మహబూబ్ సాగర్ చెరువు నుంచి మత్స్య సహకార సంఘం ఆధ్వర్యంలో చేపలు పట్టి జూపార్కుకు తరలించారు.

Tags: mahabubsagar, fish, zoo park, Sangareddy


Next Story