- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్: డైరెక్టర్ సందీప్రెడ్డి వంగా ఒక్క సినిమాతోనే భారీ పాపులారిటీ సంపాదించాడు. విజయ్ దేవరకొండను ‘అర్జున్రెడ్డి’గా చూపించి స్టార్ ఇమేజ్ ఇచ్చాడు. అదే సినిమాను హిందీలో ‘కబీర్సింగ్’గా రీమేక్ చేసి షాహిద్ కపూర్కు ఇంతకు ముందెన్నడూ లేని ఫాలోయింగ్ను తెచ్చిపెట్టారు. ఈ సినిమా సందీప్కు నేషనల్ లెవెల్ అటెన్షన్ ఇవ్వగా.. నెక్స్ట్ మూవీ ఏకంగా రాకింగ్ స్టార్ రణ్బీర్ కపూర్తో కొద్ది రోజుల క్రితం ప్రకటించారు. ‘యానిమల్’ టైటిల్తో వస్తున్న సినిమా అనౌన్స్మెంట్ చేసిన రోజునే..రణ్బీర్ క్యారెక్టర్ గురించి ఓ ఆడియో క్లిప్ రిలీజ్ చేసి సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాడు వంగా. ఒక కర్కశ కొడుకు..శాంతి స్వభావం, ప్రేమ కలిగిన తండ్రితో మాట్లాడే సంభాషణ రిలీజ్ చేసి..సినిమా స్టోరీ లైన్ చెప్పేశాడు.
అధికారం కోసం తండ్రిని కూడా చంపేందుకు వెనుకాడని క్రూరుడైన గ్యాంగ్ స్టర్గా రణ్బీర్ బిగ్ స్క్రీన్పై విశ్వరూపం చూపించబోతున్నాడు అని అర్థం అవుతుండగా.. తండ్రిగా అనిల్ కపూర్ కనిపించబోతున్నాడని సమాచారం. ఇక రణ్బీర్ భార్యగా పరిణీతి చోప్రా కన్ఫర్మ్ అయిందని బీ టౌన్ టాక్. వంగా మార్క్తో తెరకెక్కనున్న సినిమా ‘అర్జున్రెడ్డి’ని మించి ఉంటుందని..పక్కా ఇండియన్ సినిమా రికార్డులు కొల్లగొడుతుందని భావిస్తున్నారు మేకర్స్. ఇప్పటికే ‘కబీర్సింగ్’తో బాలీవుడ్లో తనదైన మార్క్ వేసిన సందీప్..‘యానిమల్’తో అక్కడే సెటిల్ అయిపోతాడేమో చూడాలి మరి.