అర్జున్‌రెడ్డి డైరెక్టర్‌ వైపు ప్రభాస్ ఫ్యాన్స్ మొగ్గు

by  |
అర్జున్‌రెడ్డి డైరెక్టర్‌ వైపు ప్రభాస్ ఫ్యాన్స్ మొగ్గు
X

దిశ, వెబ్‌డెస్క్: సందీప్ రెడ్డి వంగా… ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో దేశ వ్యాప్తంగా ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇటు డైరెక్టర్‌గా సందీప్ అటు యాక్టర్‌గా విజయ్ దేవరకొండ మంచి మార్కెట్ పొందారు. దీంతో ఏకంగా బాలీవుడ్ ఛాన్స్ కొట్టేశాడు. ‘అర్జున్ రెడ్డి’ చిత్రాన్ని హిందీలో ‘కబీర్ సింగ్‌’గా రీమేక్ చేసిన వంగా భారీ రెస్పాన్స్ అందుకున్నాడు. హీరో షాహిద్ కపూర్, హీరోయిన్ కియారా అద్వానీలకు కూడా ఈ సినిమా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను పెంచేసింది. దీంతో తన తర్వాతి సినిమాను కూడా బాలీవుడ్‌లోనే చేద్దామనుకున్నాడు వంగా. కానీ, కొన్ని పరిస్థితుల వల్ల వాయిదా వేస్తూ వస్తున్నాడు. డార్క్ థ్రిల్లర్ మూవీని చేయాలనుకున్న వంగా బాహుబలి హీరో ప్రభాస్ అయితే బాగుంటుందని అనుకుంటున్నాడట. పాన్ ఇండియా మూవీగా తీర్చిద్దాలనే ప్లాన్‌లో ఉన్న డైరెక్టర్ ప్రభాస్ కాల్షీట్ల కోసం వెయిట్ చేస్తున్నాడట.
ప్రస్తుతం రాధా‌కృష్ణ దర్శకత్వంలో ‘ఓ డియర్’ మూవీతో బిజీగా ఉన్న ప్రభాస్ నెక్స్ట్ మూవీ సందీప్‌తో చేస్తేనే బాగుంటుందని భావిస్తున్నారు ఫ్యాన్స్. బాహుబలి తర్వాత అంతకు మించిన హిట్ రావాలంటే మంచి దర్శకులు కావాలి. ఎలాగూ సుజిత్ దర్శకత్వంలో వచ్చిన ‘సాహో’ మిక్స్‌‌‌‌‌డ్ టాక్ తెచ్చుకోగా..నెక్స్ట్ వచ్చే మూవీ అయినా బ్లాక్ బస్టర్‌గా నిలిచిపోవాలని భావిస్తున్నారు. సందీప్ వంగా కాంబినేషన్‌లో మూవీ చేయాలని ప్రభాస్‌ను కోరుతున్నారు.

Next Story

Most Viewed