సజ్జనార్ మార్క్.. ఒక్క రోజులో రూ. 14.79 కోట్ల రెవెన్యూ

by  |
Sajjanar-125
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ఆర్టీసీ నష్టాల నుంచి లాభాల వైపు పరిగెడుతోంది. ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ తీసుకున్న నిర్ణయాలు ప్రయాణికులను ఆకర్షిస్తున్నాయి. అంతేకాకుండా దసరా సందర్భంగా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చే విధంగా చర్యలు తీసుకున్నారు. అంతేకాకుండా ప్రయాణికులు అసౌకర్యానికి గురికాకుండా బస్ స్టాండ్లలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుండటంతో గతంలో కంటే రద్దీ పెరిగిందనే చెప్పాలి. ఈ క్రమంలో సోమవారం ఒక్క రోజే రికార్డు స్థాయిలో ఆర్టీసీకి రెవెన్యూ వచ్చింది. కేవలం ఒక్క రోజులోనే 36.30 లక్షల కిలోమీటర్లు ప్రయాణించి, రూ. 14.79 కోట్ల రెవెన్యూ వచ్చినట్లు ఎండీ సజ్జనార్ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ప్రజల సపోర్ట్ తో గడిచిన పది రోజులు ఆర్టీసీకి ఓ మెమొరబుల్ జర్నీ అని సజ్జనార్ అన్నారు. ఈ ఆదరణ ఇలానే కొనసాగించాలని కోరారు.


Next Story

Most Viewed