క్వార్టర్‌ఫైనల్‌లో సైనా నెహ్వాల్, కిదాంబి శ్రీకాంత్

by  |
Saina Nehwal
X

దిశ, స్పోర్ట్స్: భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ ఒర్లీన్స్ మాస్టర్స్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్‌లోకి దూసుకెళ్లింది. ప్యారీస్‌లో జరుగుతున్న ఈ సూపర్ 100 సిరీస్‌లో గురువారం ఫ్రాన్స్‌కు చెందిన మారీ బాటొమేనేపై 18-21, 21-15, 21-10 తేడాతో విజయం సాధించింది. తొలి గేమ్‌ను 18-21తో పోగుట్టుకున్న సైనా.. ఆ తర్వాత పుంజుకొని ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం సాధించింది. 51 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో సైనా తన పాత ఫామ్‌ను ప్రదర్శించింది. ఇండియాకే చెందిన ఐరా శర్మ కూడా క్వార్టర్స్‌కు చేరుకుంది. బర్గేరియాకు చెందిన మారియా మిత్సోవాపై 21-18, 21-13 తేడాతో రెండో రౌండ్‌లో విజయం సాధించి క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. ఇక పురుషుల సింగిల్స్‌లో కిదాంబి శ్రీకాంత్ మలేషియాకు చెందిన కీమ్ జూన్ వీపై 21-17, 21-20 తేడాతో విజయం సాధించి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాడు.



Next Story

Most Viewed