ఓర్లీన్స్ మాస్టర్స్ సెమీస్‌లోకి దూసుకెళ్లిన భారత స్టార్ షట్లర్

by  |
ఓర్లీన్స్ మాస్టర్స్ సెమీస్‌లోకి దూసుకెళ్లిన భారత స్టార్ షట్లర్
X

దిశ, స్పోర్ట్స్: భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ ఓర్లీన్స్ మాస్టర్స్ సెమీఫైనల్‌లోకి దూసుకెళ్లింది. ప్యారీస్‌లో శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్‌లో అమెరికాకు చెందిన ఐరిస్ వాంగ్‌పై 21-19, 17-21, 21-19 తేడాతో విజయం సాధించింది. బీడబ్ల్యూఎఫ్ 100 సిరీస్ టోర్నీలో సెమీస్‌కు చేరడం గత రెండేళ్లలో సైనాకు ఇదే తొలిసారి. మహిళల డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప-సిక్కిరెడ్డి జోడి 21-14, 21-18 తేడాతో ఇంగ్లాండ్‌కు చెందిన బిరిచ్, లారెన్ స్మిత్‌లపై విజయం సాధించి సెమీఫైనల్‌కు చేరుకున్నారు. పురుషుల సింగిల్స్‌లో కిదాంబి శ్రీకాంత్ క్వార్టర్స్‌లో ఓడిపోయాడు. ఫ్రాన్స్‌కు చెందిన తోమా జూనియర్ పపోవ్‌పై 19-21, 17-21 తేడాతో ఓడిపోయాడు.

Next Story

Most Viewed