‘భగవద్గీత సాక్షి’గా చెబుతున్న తేజ్!

by  |
‘భగవద్గీత సాక్షి’గా చెబుతున్న తేజ్!
X

కరోనా మహమ్మారితో షూటింగ్స్ చేసేందుకు భయపడుతున్నా సరే.. యంగ్ హీరోలు మాత్రం ఒక్కో సినిమా కథ వింటూ లైన్‌లో పెట్టేస్తున్నారు. లాక్‌డౌన్‌లో కథలు వింటున్న కథానాయకులు.. నచ్చితే వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు. ఇలా టాలీవుడ్‌కు చెందిన చాలా మంది హీరోలు మూడు నాలుగు సినిమాలను క్యూలో పెట్టేశారు. ప్రస్తుతం ఆ లిస్ట్‌లో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా చేరిపోయాడు.

‘ప్రతిరోజూ పండగే’ సినిమాతో హిట్ అందుకున్న తేజ్.. సోలో బ్రతుకే సో బెటర్ అనే సినిమా చేస్తున్నారు. సుబ్బు దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో నభా నటేష్ హీరోయిన్ కాగా.. ఇందులో నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్ సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. ‘నో పెళ్లి దీంతల్లి.. ఆ తప్పే చేయకురా వెళ్లి’ అన్న సాంగ్ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో నడిచింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉండగా.. దేవకట్టా దర్శకత్వంలో నెక్స్ట్ సినిమా చేయబోతున్నాడు తేజ్. దీంతో పాటు తాజాగా మరో సినిమా కమిట్ అయినట్లు తెలుస్తోంది. కొత్త దర్శకుడు చెప్పిన కథ మెచ్చిన తేజ్.. ఓకే చెప్పేయడంతో పాటు ‘భగవద్గీత సాక్షిగా’ అనే టైటిల్‌ కూడా ఖరారైనట్లు తెలుస్తోంది. దేవకట్టాతో సినిమా పూర్తికాగానే.. ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుందని టాక్.


Next Story