సాగర్ పోలింగ్ : సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ శాతం ..!

by  |
సాగర్ పోలింగ్ : సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ శాతం ..!
X

దిశ, వెబ్ డెస్క్: నాగార్జున సాగర్ లో ఉపఎన్నిక కు ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఉదయం నుండే ఓటర్లు తమ ఓటు హక్కు ను వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలో బారులు తీరారు. సాయంత్రం 5గంటల వరకు 81.5 శాతం పోలింగ్ జరిగినట్లు ఎన్నికల అధికారి వెల్లడించారు. ఇంకా రెండు గంటల సమయం ఉండటంతో 2018 సాధారణ ఎన్నికల కంటే ఎక్కువ పోలింగ్ శాతం నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షిస్తున్నారు.

Next Story

Most Viewed