18 శ్మశాన వాటికల అభివృద్ధికి 18కోట్లు కేటాయించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుంది..

by  |
sabhita indra reddy
X

దిశ, జల్‌పల్లి: శాంతి భద్రతల పరిరక్షణలో తెలంగాణ పోలీస్ వ్యవస్థ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇన్ స్పెక్టర్ భాస్కర్ ఆధ్వర్యంలో పలువురి దాతల సహాయ సహకారాలతో 43,35,634 రూపాయల వ్యయంతో ఏర్పాటైన 116 సీసీ కెమెరాలను మంత్రి సబితా ఇంద్రారెడ్డి రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్‌లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని 18 శ్మశాన వాటిల అభివృద్ధికి 18 కోట్ల రూపాయలు కేటాయించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బడంగ్ పేట్ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి, మీర్ పేట్ మేయర్ దుర్గా దీప్ లాల్ చౌహాన్, బడంగ్ పేట్ డిప్యూటీ మేయర్ ఇబ్రహం శేఖర్, బాలాపూర్ ఎస్సైలు నాగరాజు, సైదులు, లింగ స్వామి, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

Next Story