- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, హైదరాబాద్: రైతుబంధు పథకంలో భాగంగా సోమవారం ఒకే రోజు 50.84 లక్షల మంది రైతుల ఖాతాల్లో నగదు జమ చేశామని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. రూ. 5294.53 కోట్ల రూపాయాలు ఆయా ఖాతాల్లోకి జమ అయ్యాయన్నారు. ఉదయం 10 గంటల నుంచి గంటకు పది లక్షల మందికి చొప్పున నగదు బదిలీ చేశామని ఆయన వివరించారు. అలాగే, ఆర్ఓఎఫ్ఆర్ (ఏజెన్సీ) పట్టాదారులకు చెందిన 63,477 మంది రైతులకు సంబంధించిన రూ.82.37 కోట్లు వారి ఖాతాలలో జమ చేశామని మంత్రి స్పష్టం చేశారు. ఈ నెల జూన్ 16 వరకు పాస్ బుక్లు వచ్చిన ప్రతి ఒక్కరికీ రైతుబంధు వర్తిస్తుందని మంత్రి సింగిరెడ్డి తెలిపారు. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో రికార్డు సమయంలో నగదు విడుదల చేశామని చెప్పుకొచ్చారు. దాదాపు 5 లక్షల మంది రైతులు బ్యాంకుల వివరాలు ఇవ్వలేదని.. ఏఈఓలకు వివరాలు అందగానే ఖాతాలలో నిధులు జమచేయాలని సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.