కరోనాతో ప్రముఖ బాలీవుడ్ నిర్మాత మృతి

by  |
కరోనాతో ప్రముఖ బాలీవుడ్ నిర్మాత మృతి
X

దిశ, సినిమా : బాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. కరోనా కారణంగా ప్రముఖ నిర్మాత రాయన్ ఇవాన్ మృతిచెందారు. ‘ఇందూ కీ జవానీ’తో పాటు షార్ట్ ఫిల్మ్ ‘దేవి’కి నిర్మాతగా వ్యవహరించిన ఆయన.. పలు చిత్రాలకు కో -ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. కాగా ఆయన మృతిపై వరుణ్ ధావన్, కియారా అద్వానీ, మనోజ్ బాజ్‌పాయ్ లాంటి ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఇది షాకింగ్ న్యూస్ అని, తన మరణం ఇండస్ట్రీకి బిగ్ లాస్ అని తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్న నటులు.. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Next Story