చెక్‎పోస్టుల వద్ద ఆర్టీసీ బస్సులు ఏర్పాటు

by  |
చెక్‎పోస్టుల వద్ద ఆర్టీసీ బస్సులు ఏర్పాటు
X

దిశ, వెబ్‎డెస్క్ : ఏపీ, తెలంగాణ చెక్ పోస్టుల దగ్గర ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేశామని ఏపీ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందానికి తీవ్రంగా ప్రయత్నించామన్నారు. తెలంగాణ ఆర్టీసీకి సెలవుల కారణంగా మంగళవారం ఒప్పందం చేసుకుంటామని టీఎస్ అధికారులు చెప్పినట్లు తెలిపారు. కాగా, టీఎస్ అధికారుల ప్రతిపాదనలపై సానుకూలంగా ఉన్నామని.. ఇంకా అధికారులు ప్రతిపాదనలు ఇవ్వలేదన్నారు. ఆర్టీసీ లాభనష్టాల గురించి కాదని.. ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని పేర్ని నాని చెప్పుకొచ్చారు.

ట్రాఫిక్ జరిమానాల పెంపుపై ప్రతిపక్షాల నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని పేర్ని నాని విమర్శించారు. వాహనదారులు బాధ్యతాయుతంగా ఉండాలని సూచించారు. నిర్లక్ష్యంగా వాహనాలు నడిపేవారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.


Next Story

Most Viewed