- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఏపీ బ్యూరో: డ్రైవర్కు గుండెపోటు రావడంతో ఆర్టీసీ బస్సు బొల్తాపడ్డ ఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. ఆదివారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మదనపల్లె డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు కర్ణాటక రాష్ట్రం బళ్ళారి నుండి తిరుపతికి వస్తుండగా శనివారం అర్థరాత్రి భాకరాపేట ఘాట్ రోడ్డులోకి రాగానే బస్సు డ్రైవర్ గంగాధరంకు గుండెపోటు వచ్చింది. దీంతో బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ గంగాధరంకు తీవ్ర గాయాలయ్యాయి. బస్సులో ప్రయాణిస్తున్న 20 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రయాణికుల ఫిర్యాదుతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం 108 వాహనంలో తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Next Story