- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్: తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం మండలం రావులపాడు వద్ద జాతీయ రహదారిపై వెళ్తున్న ఆర్టీసీ బస్సు వెనుక చక్రాలు ఊడిపడిన ఘటనలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు మంగళవారం మధ్యాహ్నం రావులపాలెం మీదుగా నరసాపురం వెళుతోంది. రావులపాడు కాలువ బ్రిడ్జి వద్దకు వచ్చేసరికి రోడ్డుపై ఉన్న గోతులలో పడి ఒక్కసారిగా వెనుక వైపు చక్రాలు విరిగిపడ్డాయి. దీంతో బస్సు అదుపుతప్పింది.
డ్రైవరు చాకచక్యంగా వ్యవహరించి బస్సును రోడ్డు పక్కన ఆపడంతో బస్సులో ఉన్న ప్రయాణికులకు ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఎ.పి37జడ్ 0017 నెంబర్ గల ఈ బస్సు వెనుక భాగంలో కట్ ప్లేట్లు విరిగిపోవడంతో వెనుక భాగం చక్రాలు ఊడిపడి 10 అడుగుల దూరంలో పడ్డాయి. దీంతో ప్రయాణీకులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఎవరికీ హాని జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 15 మంది ప్రయాణికులు ఉన్నారని డ్రైవర్ జి.శ్రీనివాసరావు తెలిపారు.