మరో అరగంటలో బస్టాండ్‌కు.. లారీ రూపంలో దూసుకొచ్చిన మృత్యువు

by  |
RTC Bus
X

దిశ, మిర్యాలగూడ: ఆర్టీసీ అద్దె బస్సును లారీ ఢీ కొట్టిన ఘటనలో ఒకరు మృతి చెందగా, ఐదుగురు గాయాలయ్యాయి. బుధవారం మిర్యాలగూడ పట్టణ పరిధిలోని ఈదులగూడలో జరిగిన ఈ ప్రమాద వివరాలను వన్​టౌన్ సీఐ శ్రీనివాస్​గౌడ్ వెల్లడించారు. మిర్యాలగూడ ఆర్టీసీ డిపోకు చెందిన ఆర్టీసీ అద్దె బస్సు గుంటూరు జిల్లా దాచేపల్లి నుంచి 45 మంది ప్రయాణికులతో వస్తుంది. పట్టణంలోని ఈదులగూడ వద్ద అద్దంకి-నార్కెట్​పల్లి రహదారి దాటుతున్న క్రమంలో గుంటూరు వైపు వెళ్తున్న లారీ వేగంగా వచ్చి బస్సును ఢీ కొట్టింది.

Larry Accident One Death

ఈ ప్రమాదంలో దాచేపల్లి మండలం రామాపురం గ్రామానికి చెందిన మంద బాబు(50) మృతి చెందాడు. కండక్టర్​మస్తాన్​వలీ, డ్రైవర్ దస్తగిరి, ఏసు, శంకర్, కోటిరెడ్డిలు గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed